సివిల్ సర్వీసెస్ డే: అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- నేడు జాతీయ సివిల్ సర్వీసెస్ డే
- అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం
- సమర్థవంతమైన, పారదర్శక, పౌర కేంద్రీకృత పాలన అందించాలని పిలుపు
- విధానాలు క్షేత్రస్థాయిలో చివరి వ్యక్తి వరకు చేరాలని స్పష్టీకరణ
- ప్రజలకు ప్రయోజనం చేకూరినప్పుడే పరిపాలన బలోపేతం అవుతుందని వ్యాఖ్య
జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సివిల్ సర్వెంట్లకు శుభాకాంక్షలు తెలిపారు. సమర్థవంతమైన, పారదర్శక, పౌర కేంద్రీకృత పాలనను అందించడంలో వారి బాధ్యతను ఈ రోజు గుర్తుచేస్తుందని ఆయన అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి పౌరుడికి అభివృద్ధి ఫలాలు చేరినప్పుడే పాలనకు సార్థకత లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందించారు.
"సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా దేశంలోని సివిల్ సర్వెంట్లందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. పరిపాలనను సమర్థవంతంగా, పారదర్శకంగా, పౌర కేంద్రంగా నడిపించడంలో మీరు మోస్తున్న గొప్ప బాధ్యతను ఈ రోజు మనందరికీ గుర్తుచేస్తుంది.
ఈ సంవత్సరం మనం ఎంచుకున్న థీమ్, "వికసిత్ భారత్: పౌర కేంద్రక పాలన, అట్టడుగు స్థాయి వరకు అభివృద్ధి". ఇది మన ముందున్న ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశిస్తోంది. అభివృద్ధి అనేది కేవలం విధానాలకే పరిమితం కాకూడదు. అది ప్రతి ఇంటికి, ప్రతి పౌరుడికి సకాలంలో, సమర్థవంతంగా చేరినప్పుడే దానికి సార్థకత చేకూరుతుంది. క్షేత్రస్థాయిలో ప్రజలకు మేలు చేసే స్థిరమైన ఫలితాలపైనే మన పరిపాలనా వ్యవస్థ యొక్క నిజమైన బలం ఆధారపడి ఉంటుంది.
ఈ బృహత్తర ప్రయత్నంలో సివిల్ సర్వెంట్లుగా మీ పాత్ర అత్యంత కీలకమైనది. ప్రభుత్వ విధానాలను ఆచరణలోకి తీసుకురావడంలో, పాలనా వ్యవస్థలను మెరుగుపరచడంలో, జవాబుదారీతనాన్ని నిలబెట్టడంలో మీరు చేస్తున్న కృషి అమూల్యమైనది. మీ క్రమశిక్షణ, నిబద్ధత, అంకితభావం దేశ పురోగతికి అర్థవంతమైన సేవలందిస్తూనే ఉన్నాయి. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు.
"సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా దేశంలోని సివిల్ సర్వెంట్లందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. పరిపాలనను సమర్థవంతంగా, పారదర్శకంగా, పౌర కేంద్రంగా నడిపించడంలో మీరు మోస్తున్న గొప్ప బాధ్యతను ఈ రోజు మనందరికీ గుర్తుచేస్తుంది.
ఈ సంవత్సరం మనం ఎంచుకున్న థీమ్, "వికసిత్ భారత్: పౌర కేంద్రక పాలన, అట్టడుగు స్థాయి వరకు అభివృద్ధి". ఇది మన ముందున్న ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశిస్తోంది. అభివృద్ధి అనేది కేవలం విధానాలకే పరిమితం కాకూడదు. అది ప్రతి ఇంటికి, ప్రతి పౌరుడికి సకాలంలో, సమర్థవంతంగా చేరినప్పుడే దానికి సార్థకత చేకూరుతుంది. క్షేత్రస్థాయిలో ప్రజలకు మేలు చేసే స్థిరమైన ఫలితాలపైనే మన పరిపాలనా వ్యవస్థ యొక్క నిజమైన బలం ఆధారపడి ఉంటుంది.
ఈ బృహత్తర ప్రయత్నంలో సివిల్ సర్వెంట్లుగా మీ పాత్ర అత్యంత కీలకమైనది. ప్రభుత్వ విధానాలను ఆచరణలోకి తీసుకురావడంలో, పాలనా వ్యవస్థలను మెరుగుపరచడంలో, జవాబుదారీతనాన్ని నిలబెట్టడంలో మీరు చేస్తున్న కృషి అమూల్యమైనది. మీ క్రమశిక్షణ, నిబద్ధత, అంకితభావం దేశ పురోగతికి అర్థవంతమైన సేవలందిస్తూనే ఉన్నాయి. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు.